మోదీపై టికాయత్ ఫైర్.. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

ABN , First Publish Date - 2021-04-20T01:31:30+05:30 IST

మోదీపై టికాయత్ ఫైర్.. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

మోదీపై టికాయత్ ఫైర్.. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

ప్రకాశం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేదని, కార్పొరేట్ కంపెనీలు దేశంలో రాజ్యమేలుతున్నాయని బీకెయూ అధ్యక్షుడు రాకేష్ సింగ్ టికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఒంగోలు ఏబీఎన్ గ్రౌండ్‌లో నిర్వహించిన కర్షక మహా పంచాయితీ సభలో టికాయత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ ‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 23 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రవేటుపరం చేశాడని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ కంపెనీల కోసమేనన్నారు. రైతుల వద్ద ఉన్న పంటలకు గిట్టుబాటు ధరలు ఉండటం లేదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వ్యవసాయ ఉత్పత్తులు వెళ్లిన తరువాత రేట్లు పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర విధానాలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని టికాయత్ హెచ్చరించారు. 

Updated Date - 2021-04-20T01:31:30+05:30 IST