పతకాలను బహుమతిగా ఇస్తాం
ABN , First Publish Date - 2020-08-04T09:08:11+05:30 IST
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది...
మోదీకి సింధు రక్షాబంధన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ‘మోదీ సర్కు రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీరు దేశం కోసం ఎంతో చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి ఒలింపిక్స్లో పతకాలు సాధించి మీకు రక్షాబంధన్ బహుమతిగా అందజేయగలమని ఆశిస్తున్నా’ అని తాను ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియోలో సింధు తెలిపింది.
స్టార్ల విషెష్..: సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గంభీర్, రిషభ్ పంత్, శిఖర్ ధవన్తో పాటు అనేకమంది క్రీడా సెలెబ్రిటీలు అభిమానులకు రాఖీ పౌర్ణ మి శుభాకాంక్షలు తెలిపారు. తమ సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సచిన్, యువరాజ్.. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరితమైన సందేశాలను పోస్ట్ చేశారు.