రెవెన్యూ చట్టంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ర్యాలీలు

ABN , First Publish Date - 2020-09-23T08:24:49+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూ చట్టంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ర్యాలీలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలతో నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ర్యాలీలు నిర్వహించారు. వారి బాటలో నడిచేందుకు మరికొందరు ఎమ్మెల్యేలు సిద్థం అవుతున్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఈ ర్యాలీలు చేపట్టాలని భావిస్తున్నారు.

Updated Date - 2020-09-23T08:24:49+05:30 IST