రైతులకు సంఘీభావంగా ర్యాలీ
ABN , First Publish Date - 2020-12-03T05:08:43+05:30 IST
ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీ భావంగా స్థానిక సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు
బెలగాం, డిసెంబరు 2: ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీ భావంగా స్థానిక సుందరయ్య భవనం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక, గిరిజన, విద్యార్థి, యువజన, రైతు సంఘాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసేలా మూడు వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని, దేశ ప్రజలపై పెనుభారంగా మారే విద్యుత్ చట్ట సవరణ రద్దు చేయాలని నినాదించారు. ప్రజా సంఘాల నాయకులు క డ్రక రామస్వామి, లక్ష్మణరావు, నాగరాజు, పి.రాజశేఖర్, రాజు, నరేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.