ఆర్యవైశ్యుల కొవ్వొత్తుల ర్యాలీ
ABN , First Publish Date - 2021-12-06T04:39:02+05:30 IST
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమి ళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఆర్యవైశ్యులు ఆదివారం రాత్రి పట్టణంలో కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించారు.
గద్వాల టౌన్, డిసెంబరు. 5 : : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఆర్యవైశ్యులు ఆదివారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సం ఘం జిల్లా అధ్యక్షుడు మేడిశెట్టి బాలస్వామి, రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ర్టాలకు తీరని లోటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16సార్లు వార్షిన బడ్జెట్ను సమర్పించిన రోశయ్య ఏ ఒక్క నెల కూడా కేంద్రం వద్దకు ఓడీ కోసం వెళ్లకపోవడం ఆయన సమర్థతతకు నిదర్శన మన్నారు.ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని భవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు నందిమల్ల సు రేష్, ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ శ్రీని వాసులు, కోశాధికారి ఆలూరు బిలకంటి రాము, త్యాగరాజు, రామకృష్ణ, శ్రీకాంత్, శివశంకర్, వీరబాబు ఉన్నారు.