రామ మందిరం ట్ర‌స్ట్ అధ్య‌క్షుడు నృత్య‌గోపాల్‌దాస్‌కు క‌రోనా పాజిటివ్‌‌

ABN , First Publish Date - 2020-08-13T18:12:31+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌కు కరోనా సోకిన‌ట్లు గుర్తించారు. విష‌యం తెలుసుకున్న‌రాష్ట్ర సీఎం యోగి...

రామ మందిరం ట్ర‌స్ట్ అధ్య‌క్షుడు నృత్య‌గోపాల్‌దాస్‌కు క‌రోనా పాజిటివ్‌‌

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌కు కరోనా సోకిన‌ట్లు గుర్తించారు. విష‌యం తెలుసుకున్న‌రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితి గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెదాంతకు చెందిన డాక్టర్ త్రెహన్‌తో ఫోన్‌లో మాట్లాడి, నృత్య గోపాల్ దాస్‌కు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే అతనికి మెరుగైన‌ వైద్య సదుపాయాలు అందించాల‌ని జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు వైద్యులను ఆయన ప్రత్యేకంగా ఆదేశించారు. నృత్య గోపాల్ దాస్ శ్రీ కృష్ణ జన్మదినోత్స‌వానికి మధురకు వెళ్లి వ‌చ్చిన త‌రువాత అత‌నిలో అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. 


Updated Date - 2020-08-13T18:12:31+05:30 IST