అతిథుల సంఖ్యను కుదించిన అయోధ్య ట్రస్ట్.. 170 మందికే ఆహ్వానం

ABN , First Publish Date - 2020-08-02T17:26:05+05:30 IST

ఆగస్టు 5 న జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి అతి తక్కువ మందికే ఆహ్వానం పంపాలని

అతిథుల సంఖ్యను కుదించిన అయోధ్య ట్రస్ట్.. 170 మందికే ఆహ్వానం

లక్నో : ఆగస్టు 5 న జరగబోయే భూమి పూజ కార్యక్రమానికి అతి తక్కువ మందికే ఆహ్వానం పంపాలని ట్రస్ట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదట 200 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు పంపాలని ట్రస్ట్ నిర్ణయించుకుంది. తాజాగా ఈ సంఖ్యను కూడా కుదించాలని నిర్ణయించుకున్నారు. కేవలం 170 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు పంపాలని ట్రస్ట్ తాజాగా నిర్ణయించుకుంది. కరోనా మహమ్మారి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రస్ట్ పేర్కొంది.


దాదాపు 50 మంది సాధు సంతులు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ సాధు సంతుల జాబితాలో మోరారీ బాపు, శ్రీశ్రీశ్రీ రవి శంకర్ పేర్లు ప్రస్తుతానికి లేవు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ ఆనందీబేన్ పాటిల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షులు నృత్య గోపాల్ దాస్‌, ఆరెస్సెస్ అగ్రనేతలు దత్తాత్రేయ హోసబళే, భయ్యాజీ జోషి తదితరులు హాజరుకానున్నారు. 

Updated Date - 2020-08-02T17:26:05+05:30 IST