రామ మందిర నిర్మాణానికి ముస్లిం దంపతుల విరాళం

ABN , First Publish Date - 2021-01-19T06:59:15+05:30 IST

అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన షేక్‌మాబ్‌ జానీ, ఆమ్‌దినిషా ముస్లిం దంపతులు రూ.వంద అందజేశారు.

రామ మందిర నిర్మాణానికి ముస్లిం దంపతుల  విరాళం

ద్రాక్షారామ, జనవరి 18: అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన షేక్‌మాబ్‌ జానీ, ఆమ్‌దినిషా ముస్లిం దంపతులు రూ.వంద అందజేశారు. నిధి సమర్పణ అభియాన్‌ మండల ఇన్‌చార్జి దూడల శంకరనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో  మండల కోశాధికారి అప్పన రాజశేఖర్‌, గంధం విజయభాస్కర్‌,  గంధం ఉమాశంకర్‌, పుణ్యమంతుల చంద్రశేఖర్‌, దాసరి చినబాబు పాల్గొన్నారు. 

  రూ.1.50 లక్షల విరాళం

అమలాపురం టౌన్‌, జనవరి 18: అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన దాతలు సోమవారం రూ.1.50 లక్షలు విరాళం అందించారు. భూపయ్య అగ్రహారానికి చెందిన కూచిమంచి సోదరీమణులు తరుపున సంస్కారభారతి అధ్యక్షుడు కూచిమంచి రాంబాబు రూ.51,116, కొచ్చర్లకోట బాపనమ్మ రూ.50,116, కూచిమంచి నాగమణి రూ.50,616 విరాళాన్ని సంస్థ ప్రతినిధి పుత్సా కృష్ణకా మేశ్వర్‌కు  అందజేశారు.

Updated Date - 2021-01-19T06:59:15+05:30 IST