రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
ABN , First Publish Date - 2021-01-21T06:39:11+05:30 IST
శ్రీరామ మందిర నిర్మాణ క్షేత్రట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంగరలో బుధవారం గ్రామానికి చెందిన రాగం రామచంద్రరావు, సీతమ్మ దంపతులు విరాళాల సేకరణ ప్రారంభించారు.
కపిలేశ్వరపురం, జనవరి 20: శ్రీరామ మందిర నిర్మాణ క్షేత్రట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంగరలో బుధవారం గ్రామానికి చెందిన రాగం రామచంద్రరావు, సీతమ్మ దంపతులు విరాళాల సేకరణ ప్రారంభించారు. బీజేపీ మండల కోకన్వీనర్ తోరం రాము, కందికుప్ప సత్యవీరబ్రహ్మం ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో నియోజవకర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కార్యక్రమంలో దాసరి కాళీకృష్ణ, ఇండుగుల సూరిబాబు, కంకటాల నాగబాబు, చిలుకూరి వీరవేణి తదితరులు పాల్గొన్నారు.