నిబంధనల మేరకు రంజాన్‌ వేడుకలు జరుపుకోవాలి

ABN , First Publish Date - 2021-05-10T06:00:30+05:30 IST

ముస్లిం సోదరులు నిబంధనల మేరకు రంజాన్‌ వేడుక లు జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

నిబంధనల మేరకు రంజాన్‌ వేడుకలు జరుపుకోవాలి
గిఫ్ట్‌ ప్యాకెట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

రాయికల్‌, మే 9: ముస్లిం సోదరులు నిబంధనల మేరకు రంజాన్‌ వేడుక లు జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రా యికల్‌ పట్టణంలోని ముస్లిం కమ్యూనిటీ హాల్‌లో ప్రభుత్వం తరపున రంజా న్‌ గిఫ్ట్‌ ప్యాకెట్లను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం అందించే గిఫ్ట్‌ ప్యాకెట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్ర మంలో మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, తహసీల్దార్‌ మహేశ్వర్‌, మైనారి టీ అధ్యక్షుడు ఇంతియాజ్‌, కోఆఫ్షన్‌ మోఖీద్‌, మజీద్‌ కమిటీ అధ్యక్షుడు హు స్సేన్‌ యూత్‌ అధ్యక్షుడు ఎలిగేటి అనీల్‌, నాయకులు మహేష్‌గౌడ్‌, రాజమౌ ళి, సురేంధర్‌నాయక్‌, రాజలింగం, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

మండలంలోని కట్కాపూర్‌ గ్రామానికి చెందిన 6గురు ఆడపడుచులకు ఒ క్కొక్కరికి రూ.లక్ష116 రూపాయల విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులను అం దజేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ రాజమౌళి పాల్గొన్నారు. అనంతరం కరో నాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లిం యువకుల ను ఎమ్మెల్యే సంజయ్‌ సన్మానించారు. వారిని శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. 


Updated Date - 2021-05-10T06:00:30+05:30 IST