రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డికి ఐజీగా పదోన్నతి

ABN , First Publish Date - 2022-01-23T05:58:17+05:30 IST

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డికి ఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డికి ఐజీగా పదోన్నతి
సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, జనవరి 22: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డికి ఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత జూలై 28న చంద్రశేఖర్‌రెడ్డికి రామగుండం సీపీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం డీఐజీ హోదాలో ఉన్న ఆయ నకు ఐజీగా పదోన్నతి లభించింది. చంద్రశేఖర్‌రెడ్డి గతం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల్లో డీఎస్‌పీగా, అడిషనల్‌ ఎస్‌పీ పని చేశారు. ఐపీఎస్‌ పొందిన తరువాత కర్నూల్‌, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి ఎస్‌పీగా పని చేశారు. ఐజీగా పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌రెడ్డికి త్వరలోనే పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-23T05:58:17+05:30 IST