పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-11-07T20:21:34+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రామాలాడుతూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నాయని..
విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రామాలాడుతూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, డ్రైనేజి పన్ను, కరెంట్ బిల్లులు పెంచుతున్నది ఎవరో ప్రజలకు తేటతెల్లమైందన్నారు. ప్రజలపై భారాలు మోపుతూ ఆదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే పోర్టులు, సోలార్ విద్యుత్, బొగ్గు కొనుగోలు అంతా ఆదానీకే అప్పగించారని, రాష్ట్రాన్ని దోచి పెట్టడానికే జగన్రెడ్డి అధికారంలో ఉన్నారని రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.