కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-09-25T14:52:31+05:30 IST
అమరావతి: సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను..
అమరావతి: సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను.. రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 6 నెలలుగా వీరికి వేతనాలు లేక లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులలో సాంకేతిక లోపం కారణంగా... గత సంవత్సరంలో వీరికి 10 నెలల వేతనమే విడుదలైందని రామకృష్ణ తెలిపారు.