ఈ రెండు చాలు వైసీపీ ప్రభుత్వం ఏంటో చెప్పడానికి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-07-02T17:40:53+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ రెండు చాలు వైసీపీ ప్రభుత్వం ఏంటో చెప్పడానికి: రామకృష్ణ

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. పెత్తందారి పోకడలను ఎండకడతామన్నారు. జగన్ ప్రభుత్వం ఏంటో చెప్పడాని ఈ రెండు చాలంటూ పత్రికలు చూపించారు. యూనివర్శిటీల్లో ఎవరూ మాట్లాడడంలేదని, అన్ని వర్శిటీల్లో వైసీపీవాళ్లే ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రమంతా మీ కోసమే ఉందా? అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం అని చెప్పే జగన్.. వైసీపీలో సామాజిక న్యాయం లేదని తెలియదా? అని అన్నారు. సామాజిక న్యాయం అంటే ‘మా మొఖాన పెన్షన్, రేషన్ కార్డు పడేసి.. మీరంతా కింది నుంచి పైవరకు దోపిడీ చేసుకుంటారా? అంతా మీ పెత్తనమే జరగాలా?’ అని రామకృష్ణ దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ తీరును ప్రతి గ్రామంలో తిరిగి  ఎండగడతామన్నారు. ప్రతి యూనివర్శిటీల్లో మీటింగ్‌లు పెడతామని రామకృష్ణ స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-02T17:40:53+05:30 IST