అగ్రిగోల్డ్ బాధితులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-23T13:53:56+05:30 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు.

అగ్రిగోల్డ్ బాధితులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు: రామకృష్ణ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు రు.1150 కోట్లు చెల్లిస్తామని, మరో 6 నెలల్లో మిగిలిన మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలని రామకృష్ణ సూచించారు. 


ఇప్పటికే పలువురు అగ్రిగోల్డ్ బాధితులు ఆర్థిక, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు పాల్పడ్డారని వెల్లడించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. మీరు బడ్జెట్‌లో కేటాయించిన సొమ్మును అగ్రిగోల్డ్ బాధితులకు అందజేసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానని రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - 2020-05-23T13:53:56+05:30 IST