తక్షణమే హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఏర్పాటు చేయండి: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-05-28T16:46:00+05:30 IST
అమరావతి: రాష్ట్రంలో తక్షణమే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి..
అమరావతి: రాష్ట్రంలో తక్షణమే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను 4 నెలల్లోగా ఏర్పాటు చేయమని గత అక్టోబర్లో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటికి 7 నెలలు కావస్తున్నా కమిషన్ ఏర్పాటు చేయకపోవడం హైకోర్టు ధిక్కరణకాదా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
మానవ హక్కులకు భంగం వాటిల్లిన పలు సందర్భాలలో, కరోనా విపత్తు నేపథ్యంలో పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రజలకు మానవ హక్కుల కమిషన్ ఎంతో బాసటగా ఉండేదన్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ రాష్ట్రంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని రామకృష్ణ పేర్కొన్నారు.