వైభవంగా రామలింగేశ్వరుడి రథోత్సవం
ABN , First Publish Date - 2021-01-17T05:35:32+05:30 IST
మండలంలోని జంగమరెడ్డిపల్లె రామలింగేశ్వర స్వామి రథోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయం చుట్టూ రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రత్యేక పూజలు చేశారు.
ఇల్లంతకుంట, జనవరి 16: మండలంలోని జంగమరెడ్డిపల్లె రామలింగేశ్వర స్వామి రథోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయం చుట్టూ రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ శ్రీలతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వేణురావు, సెస్డైరెక్టర్ అయిలయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనాథ్గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయ పనుల పరిశీలన
తహసీల్దార్ కార్యాలయ పనులను ఎమ్మెల్యే రసమయి, కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు. అన్ని హంగులతో కార్యాలయ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే నూతన భవనంలోకి కార్యాలయం రానుందని తెలిపారు. తహసీల్దార్ రాజిరెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ నర్సయ్యయాదవ్, ఉపసర్పంచ్ సాదుల్ తదితరులు పాల్గొన్నారు.