సెట్నల్ సీఈవోగా రమేష్
ABN , First Publish Date - 2020-08-05T11:25:56+05:30 IST
సెట్నల్ సీఈవో గా కె రమేష్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
8న బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (వెంకటేశ్వరపురం)ఆగష్టు 04 : సెట్నల్ సీఈవో గా కె రమేష్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్చార్జి సీఈవోగా ఉన్న యతిరాజ్ స్థానంలో గుంటూరులోని అగ్రికల్చర్ యునివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రమేష్ను నియమించారు. రమేష్ గతంలో జిల్లాలోని పలు శాఖల్లో పనిచేసిన అనుఽభవం ఉంది. నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా, బీసీ కార్పొరేషన్ ఈడీగా , రెండు పర్యాయాలు డీ ఏఏటీటీసీ శాస్త్రవేత్తగా, మెప్మా జిల్లా అఽధికారిగా పనిచేశారు. తాజాగా జిల్లా సెట్నల్ సీఈవోగా నియమించారు. ఈ నెల 8న బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.