‘14 తర్వాత నా సత్తా ఏంటో చూపుతా’
ABN , First Publish Date - 2021-12-03T17:17:24+05:30 IST
వార్ జరిగినా వెనుకాడను ఈనెల 14 తర్వాత నా సత్తా ఏంటో డీకే శివకుమార్కు చూపుతానని మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి సవాల్ విసిరారు. గురువారం బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతరుల
- గతంలో జరిగిన అన్ని విషయాలు బయట పెడతా
- డీకే శివకుమార్పై మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి ఫైర్
- వార్ జరిగినా వెనుకాడను
బెంగళూరు: ఈనెల 14 తర్వాత నా సత్తా ఏంటో డీకే శివకుమార్కు చూపుతానని మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి సవాల్ విసిరారు. గురువారం బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతరుల తరహాలో మనసులో ఏదో ఒకటి పెట్టుకుని మాట్లాడేది లేదన్నారు. విధానపరిషత్ ఎన్నికలు ముగిశాక డీకే శివకుమార్ వ్యక్తిత్వం తన వ్యక్తిత్వం ఏమిటనేది చెబుతానన్నారు. అవసరమైతే వార్కు వెనుకాడేది లేదన్నారు. తన శక్తి ఏమిటో చూపుతానన్నారు. 1985నుంచి జరిగిన అన్ని అంశాలు బహిరంగం చేస్తానన్నారు. అప్పుడు నేను ఏమిటో డీకే శివకుమార్ ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారో తెలుస్తుందన్నారు. గంట వ్యవధిలో డీకే కుటుంబం ఏమిటో జార్కిహొళి కుటుంబీకులు ఎలాంటివారో తేలుస్తామన్నారు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నందుకు సరిపోయింది కానీ లేదంటే నన్ను ముగించేవారన్నారు. సంఘ్పరివార్ పెద్దల మద్దతుతోనే నాయకుడయ్యానన్నారు. బ్లాక్మెయిల్ ఎవరు చేశారనేది చెబుతానన్నారు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోండి చూద్దాం అంటూ ఆయన ఈ సందర్భంగా సవాల్ విసిరారు.