ఎస్ఈబీ డైరెక్టర్గా రమేశ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-04-21T09:49:37+05:30 IST
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ఆవుల రమేశ్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈబీకి బదిలీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తిరుపతి అర్బన్ ఎస్పీగా ఉన్న ఆయనను..
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ఆవుల రమేశ్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈబీకి బదిలీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తిరుపతి అర్బన్ ఎస్పీగా ఉన్న ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు అక్కడి నుంచి తప్పించి ఇంటెలిజెన్స్లో ఉన్న వెంకటప్పలనాయుడును నియమించింది. ప్రస్తుతం మద్యం అక్రమ దిగుమతి, ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన ఎస్ఈబీలో స్పెషల్ విభాగం డైరెక్టర్గా ఒక పోస్టును సృష్టించి రమేశ్రెడ్డిని ప్రభుత్వం నియమించింది.