తలిశెట్టి అవార్డుకు రామ్శేషు ఎంపిక
ABN , First Publish Date - 2021-05-12T05:21:23+05:30 IST
తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలో నెల్లూరు వాసి మోపూరు రామ్శేషు తలిశెట్టి రామారావు విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు.
తలిశెట్టి అవార్డుకు రామ్శేషు ఎంపిక
నెల్లూరు(సాంస్కృతిక, ప్రతినిధి), మే 11 : తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీలో నెల్లూరు వాసి మోపూరు రామ్శేషు తలిశెట్టి రామారావు విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. హాస్యానందం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో రామ్శేషు కార్టూన్ బహుమతికి ఎంపికైంది. ప్రముఖ సినీనటులు తనికెళ్ల భరణి, ప్రముఖ కార్టూనిస్టులు ఎవీఎమ్, సుబ్బరాజు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన పోటీలో రామ్శేషు ఎంపిక కావటం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు. కొవిడ్ తగ్గాక బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.