గ్రంథాలయాల అభివృద్ధికి రంగనాథ్‌ కృషి

ABN , First Publish Date - 2020-08-13T10:07:41+05:30 IST

గ్రంథాలయాల అభివృద్ధికి రామాంజనేయ రంగనాథ్‌ కృషి ఎనలేనిదని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌ తెలిపారు.

గ్రంథాలయాల అభివృద్ధికి రంగనాథ్‌ కృషి

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఆగస్టు 12: గ్రంథాలయాల అభివృద్ధికి రామాంజనేయ రంగనాథ్‌ కృషి ఎనలేనిదని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌ తెలిపారు. బుధవారం పోస్టాఫీస్‌ సెంటర్‌లోగల జిల్లా గ్రంథాలయంలో ఆయన చిత్ర పటానికి పూలతో ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి. మణిమృదుల, సిబ్బంది రుక్మిణి, స్వప్న, జయరాం పాల్గొన్నారు. 

 

సంకల్పంతో వైకల్యాన్ని జయించిన ఇంజనీర్‌ : 

వైకల్యాన్ని జయించి చిరస్మరణీయ కట్టడాలు నిర్మించిన ఇంజనీర్‌, మాజీ పాలిటెక్నిక్‌ అ ధ్యాపకుడు అయిలూరి సత్యనారాయణ రెడ్డి 58వ జయంతి వేడుకలను బుధవారం సంఘ కార్యాలయంలో నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీవీపీఎస్‌ అధ్యక్షుడు గుండప నే ని సతీష్‌, సభ్యులు ఖాదర్‌బాబా, మేడి ప్రవీణ్‌ కుమార్‌, శివరామకృష్ణ, చాంద్‌పాషా, నగేష్‌, హుస్సేన్‌మియా ర ఫీ, నాని, శ్రీను, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T10:07:41+05:30 IST