హైదరాబాద్ శివారులో విషాదం
ABN , First Publish Date - 2021-01-16T19:18:11+05:30 IST
హైదరాబాద్ శివారు శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని ప్రేమ్ అనే రైతు పశువుల దొడ్డికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు.
రంగారెడ్డి: హైదరాబాద్ శివారు శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని ప్రేమ్ అనే రైతు పశువుల దొడ్డికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పశువుల పాకలో నిద్రిస్తున్న మూడు గేదెలు, మూడు లేగ దూడలు సజీవ దహనమయ్యాయి. కుంటుంబాన్ని పోషిస్తున్న గేదలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.