హైదరాబాద్ శివారులో విషాదం

ABN , First Publish Date - 2021-01-16T19:18:11+05:30 IST

హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని ప్రేమ్ అనే రైతు పశువుల దొడ్డికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు.

హైదరాబాద్ శివారులో విషాదం

రంగారెడ్డి: హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హుడాకాలనీలోని ప్రేమ్ అనే రైతు పశువుల దొడ్డికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పశువుల పాకలో నిద్రిస్తున్న మూడు గేదెలు, మూడు లేగ దూడలు సజీవ దహనమయ్యాయి. కుంటుంబాన్ని పోషిస్తున్న గేదలు మృతి చెందడంతో  కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-16T19:18:11+05:30 IST