Rangareddy: వృద్ధుడిని చంపిన మరో వృద్ధుడు..

ABN , First Publish Date - 2022-01-06T17:23:46+05:30 IST

రాజేంద్రనగర్‎లో దారుణం జరిగింది. ఓ వృద్ధుడిని గ్లాస్ ముక్కతో పొడిచి చంపాడు మరో వృద్ధుడు. వివరాల్లోకి వెళ్తే..బండ్లగూడ జాగీర్‌లో ఇద్దరు వృద్ధుల మధ్య ఘర్షణ

Rangareddy: వృద్ధుడిని చంపిన మరో వృద్ధుడు..

రంగారెడ్డి: రాజేంద్రనగర్‎లో దారుణం జరిగింది. ఓ వృద్ధుడిని గ్లాస్ ముక్కతో పొడిచి చంపాడు మరో వృద్ధుడు. వివరాల్లోకి వెళ్తే..బండ్లగూడ జాగీర్‌లో ఇద్దరు వృద్ధుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరినొకరు మాటలతో దూషించుకున్నారు. అయితే.. ఆగ్రహంతో మరో వృద్ధుడు సాదిక్ హుస్సేన్‌ను కిటికీ గ్లాస్‌తో వృద్ధుడు అయాజ్ అబ్దుల్ పొడిచాడు. దీంతో రక్తపు మడుగులో పడివున్న సాదీక్ హుస్సేన్‎కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే సాదిక్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు అయాజ్ అబ్దుల్‎ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2022-01-06T17:23:46+05:30 IST