మంత్రుల్లో సంపన్నుడు ఈయనే..

ABN , First Publish Date - 2021-05-13T17:47:49+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గంలో అందరికంటే సంపన్నుడు రాణిపేట ఎమ్మెల్యే గాంధీ అని, ఆయన దాఖలు చేసిన ప్రమాణపత్రం ద్వారా తెలుస్తోంది....

మంత్రుల్లో సంపన్నుడు ఈయనే..

చెన్నై/పెరంబూర్: రాష్ట్ర మంత్రివర్గంలో అందరికంటే సంపన్నుడు రాణిపేట ఎమ్మెల్యే గాంధీ అని, ఆయన దాఖలు చేసిన ప్రమాణపత్రం ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో తక్కువ ఆస్తులు కలిగిన మంత్రిగా పద్మనాభపురం ఎమ్మెల్యే మనో తంగరాజ్‌ చోటుచేసుకున్నారు. ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు మంత్రులు దాఖలుచేసిన ప్రమాణపత్రాల్లో చోటుచేసుకున్నాయి. రాణిపేట నియోజకవర్గంలో విజయం సాధించి, చేనేత మరియు జౌళి, ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంఆర్‌ గాంధీ,రాష్ట్ర మంత్రివర్గంలో అత్యం త సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.47.94 కోట్లు. ఆస్తుల్లో మాత్రమే మంత్రి గాంధీ సంపన్నుడు కాడు. అధిక అప్పులున్న మంత్రి కూడా ఆయనే. ఆయన అప్పులు రూ.14.46కోట్లుగా వున్నా యి. అదే సమయంలో తక్కువ ఆస్తులు కలిగిన మంత్రిగా ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్‌ నిలిచారు. ఆయన ఆస్తులు రూ.23.39 లక్షలు మాత్రమే. ఆయన మినహా మిగిలిన 31 మంది మంత్రులు కోటీశ్వరులు.

Updated Date - 2021-05-13T17:47:49+05:30 IST