సౌరాష్ట్ర భారీ స్కోరు
ABN , First Publish Date - 2020-02-22T10:34:13+05:30 IST
ఆంధ్రతో రంజీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో భారీస్కోరు చేసింది. చిరాగ్ జానీ (121) సెంచరీతో విజృంభించడంతో..
జానీ సెంచరీ
ఆంధ్రతో రంజీ క్వార్టర్స్
ఒంగోలు కార్పొరేషన్ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రతో రంజీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో భారీస్కోరు చేసింది. చిరాగ్ జానీ (121) సెంచరీతో విజృంభించడంతో.. ఓవర్నైట్ స్కోరు 226/6తో రెండో రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన సౌరాష్ట్ర 419 వద్ద ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (80) అర్ధ సెంచరీతో మెరిశాడు. చిరాగ్-ప్రేరక్ ఏడో వికెట్కు 157 రన్స్ జోడించారు. శశికాంత్ (3/149), పృథ్వీరాజ్ (3/51) మూడేసి వికెట్లు తీశారు. స్టీఫెన్ (2/72) రెండు, కరణ్ షిండే (1/4), మహ్మద్ రఫీ (1/82) చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర ఆట చివరకు 40/2 స్కోరుతో కష్టాల్లో పడింది.