ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలి: రంజిత్ రెడ్డి
ABN , First Publish Date - 2021-03-08T23:17:28+05:30 IST
హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని సోమవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఢిల్లీ: హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని సోమవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పత్రాలు అందజేయలేదన్న కేంద్ర ప్రభుత్వం వాదనను ఆయన తప్పు పట్టారు. 2014 లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014 సంవత్సరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వివరణాత్మక మెమోరాండాన్ని పంపించారని తెలిపారు. 2016 సంవత్సరంలో ఐటీఐఆర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించమని రంజిత్ రెడ్డి తెలిపారు.