అత్యాచారం.. ఆపై మూత్రశాలలో పడేసి..
ABN , First Publish Date - 2020-09-09T12:47:32+05:30 IST
గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. సికింద్రాబాద్లో కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రపతి రోడ్డులోని రైల్వే వంతెన పక్కన
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. సికింద్రాబాద్లో కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రపతి రోడ్డులోని రైల్వే వంతెన పక్కన ఉన్న మూత్రశాలలో మంగళవారం ఉదయం ఓ మహిళ(35) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై దుస్తులు లేవు, దుప్పటి కప్పి ఉంది. ఆమెపై రెండు రోజుల క్రితం మరో ప్రాంతంలో అత్యాచారం చేసి చంపేసి మృతదేహాన్ని మూత్రశాలలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.