భారత్‌లో శరవేగంగా కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2020-07-12T17:03:00+05:30 IST

భారత్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది.

భారత్‌లో శరవేగంగా కరోనా వ్యాప్తి

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించాయి. గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 28,637 కేసులు నమోదుకాగా,  551 మంది మృతి చెందారు. భారత్‌లో ఈ స్థాయిలో కేసులు నమోదవడం, కరోనా రోగులు మృతి చెందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


దేశం వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 8,49,553కు పెరిగింది. మృతుల సంఖ్య 22,687కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,92,258 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చికిత్స నుంచి కోలుకుని 5,34,621 మంది  డిశ్చార్జ్ అయ్యారు.

Updated Date - 2020-07-12T17:03:00+05:30 IST