మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శరవేగంగా సీట్ల భర్తీ

ABN , First Publish Date - 2020-09-23T06:40:28+05:30 IST

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్లు శరవేగంగా భర్తీ అవుతున్నాయి. 2020-2021 విద్యాసంవత్సరంలో భాగంగా దోస్త్‌ ద్వారా మొదటి

మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శరవేగంగా సీట్ల భర్తీ

 రాష్ట్రస్థాయిలో పదో స్థానం 


మెదక్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 22 : మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్లు శరవేగంగా భర్తీ అవుతున్నాయి. 2020-2021 విద్యాసంవత్సరంలో భాగంగా దోస్త్‌ ద్వారా మొదటి విడత సీట్ల కేటాంపుల్లో రాష్ట్ర స్థాయిలో టాప్‌టెన్‌లో నిలిచింది. నాన్‌ అటానమస్‌ కళాశాల స్థాయిలో ఐదో స్థానంలో ఉంది. కళాశాలలో 780 సీట్ల పరిమితి ఉండగా, మొదటి విడతలోనే 687 మంది విద్యార్థులు కళాశాలకు ఎంపికయ్యారు. 88.08 శాతంతో రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచింది. దాంతో టాప్‌ 10 కళాశాలల సరసన చేరింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 వరకు దోస్త్‌ వెబ్‌సెట్‌ ద్వారా సెల్ప్‌ రిపోర్టింగ్‌ చేయాలని ప్రిన్సిపల్‌ డా.పి.వి. నరసింహం సూచించారు. 

Updated Date - 2020-09-23T06:40:28+05:30 IST