కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
ABN , First Publish Date - 2021-03-02T06:44:35+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని మానేరు బిడ్జి వద్ద జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 1: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని మానేరు బిడ్జి వద్ద జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయ కులను కించపరిచారంటూ మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మను దహ నం చేశారు. అనంతరం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నిరుద్యోగులకు భృతి ఇస్తా మన్న ప్రభుత్వం విస్మ రిం చిందన్నారు. హామీలను అమలు చేయని పక్షంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో తిరగనీయబోమన్నారు. అనం తరం పట్టణ సీఐ వెంకటనర్సయ్య ఆధ్వ ర్యంలో యువజన కాంగ్రెస్ నాయ కులను పోలీస్ స్టేషన్కు తరలించారు.