‘నేటి నుంచి రేషన్‌ పంపిణీ’

ABN , First Publish Date - 2020-03-29T10:07:01+05:30 IST

నేటి నుంచి అన్ని రేషన్‌ షాపుల్లో రేషన్‌ అందిస్తారని తహసీల్దార్‌ వెంకటలక్ష్మి అన్నారు.

‘నేటి నుంచి రేషన్‌ పంపిణీ’

తుగ్గలి, మార్చి 28: నేటి నుంచి అన్ని రేషన్‌ షాపుల్లో రేషన్‌ అందిస్తారని తహసీల్దార్‌ వెంకటలక్ష్మి అన్నారు. శనివారం మండల కేంద్రమైన తహసీల్దార్‌ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని రేషన్‌ దుకాణాల్లో నేటి నుంచి రేషన్‌ పంపిణీ జరుగుతుందని, గుంపులు గుంపులుగా వెళ్లకుండా ఒక ప్రణాళిక పద్ధతిలో రేషన్‌ తీసుకుని వెళ్లాలని అన్నారు.


అలాగే వందశాతం రైస్‌ కార్డులు మ్యాపింగ్‌ పూర్తి అయిందన్నారు. యూనిట్‌ ఒకరికి, 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తారని, ఇది ఉచితంగా ఇస్తారని ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

Updated Date - 2020-03-29T10:07:01+05:30 IST