రేషన్ లారీ పట్టివేత
ABN , First Publish Date - 2021-09-16T01:48:37+05:30 IST
జిల్లాలోని మైలవరంలో రేషన్ లోడ్తో ఉన్న లారీని
కృష్ణా: జిల్లాలోని మైలవరంలో రేషన్ లోడ్తో ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ రోడ్లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద లారీ ఆగి ఉంది. అనుమానం రావడంతో తన సిబ్బందితో కలిసి మైలవరం ఎస్ఐ రాంబాబు తనిఖీలు చేసాడు. ఈ తనిఖీల్లో రేషన్ బియ్యం దొరికాయి. లారీలో దాదాపు10 నుంచి15 టన్నులు బియ్యం ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీని పోలీసులు స్టేషన్కి తరలించారు. లారీ డ్రైవర్, ఓనర్ను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.