మినీట్రక్కు వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-01-17T05:32:22+05:30 IST
రేషన్సరుకులు లబ్ధిదారుల ఇంటి వద్దకే చేర్చే మినీట్రక్కుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు.
కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశం
ఒంగోలు(కలెక్టరేట్), జనవరి 16 : రేషన్సరుకులు లబ్ధిదారుల ఇంటి వద్దకే చేర్చే మినీట్రక్కుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శుక్రవారం కార్పొరేషన్ అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, వా హనాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ వాహనాల డీలర్లు లబ్ధిదారుల వివరాలను తమ లాగిన్లో అప్ లోడ్ చేయాలని, సమాంతరంగా రవాణాశాఖ అధికారులు రిజస్ట్రేషన్ చేప ట్టాలన్నారు. జిల్లాకు 589 వాహనాలు కేటాయించారని, ఆయా కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసినందున సత్వరమే రిజస్ట్రేషన్ను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో జేసీ చేతన్, డీఎస్వో సురేష్, పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ నారదముని, వివిధశాఖల అధికారులు గ్లోరియా, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.