110 క్వింటాళ్ళు రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-10-17T04:25:49+05:30 IST
నిడదవోలు మండలం సూరాపురంలో శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారులు పీడీఎస్ బియ్యం 110 క్విం టాళ్ళను స్వాధీనం చేసుకు ని పలువురిపై కేసులు నమోదు చేశారు.
నిడదవోలు, అక్టోబరు 16: నిడదవోలు మండలం సూరాపురంలో శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారులు పీడీఎస్ బియ్యం 110 క్విం టాళ్ళను స్వాధీనం చేసుకు ని పలువురిపై కేసులు నమోదు చేశారు. వివరా ల్లోకి వెళితే... విజిలెన్స్ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో సూరాపురంలో మూడు చోట్ల దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన కోలా రాజేష్, ముత్యాల పోసిబాబుల నుంచి 30 క్వింటాళ్ళు, కోలా ఆంజనేయులు, మెట్టపల్లి నర్సన్నరాజు, మొర్ల శివగోపి, సమయం సతీష్, వెలుగుల సత్యనారాయణ, మానే నాగేశ్వరరావుల వద్ద 70 క్వింటాళ్ళు, వెలుగుల సత్యనారాయణ నుంచి 10 క్వింటాళ్ళు మొత్తం 110 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని, టాటాఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని వీరిపై 6(ఎ), 7(1) కేసులు నమోదు చేసినట్లు నిడదవోలు సివిల్ సప్లయిస్ డిప్యూటి తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు.