పలు చోట్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-24T06:44:58+05:30 IST

శని, ఆదివారాల్లో అధికారులు దాడులు జరిపి రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

పలు చోట్ల రేషన్‌ బియ్యం పట్టివేత

జీలుగుమిల్లి/నల్లజర్ల/వీరవాసరం, జనవరి 23:శని, ఆదివారాల్లో అధికారులు దాడులు జరిపి రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. జీలుగుమిల్లి  చెక్‌పోస్టు వద్ద సివిల్‌ సప్లై డీటీ శ్రీనివాస్‌ నల్గొండ జిల్లా కోదాడ నుంచి యానాంకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 9 టన్నుల రేషన్‌ బియ్యంను పట్టుకున్నారు. వీటి విలువ రూ. 1.26 లక్షలు ఉంటుందని తెలిపారు.  అలాగే గుంటూరు నుంచి తూర్పు గోదావరి జిల్లాకు లారీలో తరలిస్తున్న 320 క్వింటాళ్ల బియ్యాన్ని నల్లజర్లలో సెబ్‌ అధికారులు శనివారం రాత్రి పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

వీరవాసరం మండలం  చింతలకోటిగరువు గ్రామంలో విజిలెన్స్‌ , రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి కొల్లేపర రామాంజనేయులు,  కొల్లేపర నాగేశ్వరరావు నుంచి 6300 కేజీలు, కొత్తుల వెంకట సత్యనారాయణ నుంచి 2810 కేజీలు మొత్తం 9110 కేజీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గ్రామ శివార్లలో చెట్టు పొదల్లో దాచి ఉంచిన 12 బస్తాల్లో దాచి ఉంచిన 600 కేజీల బియ్యాన్ని అధి కారులు స్వాధీనం చేసుకున్నారు.  ఇవి ఎవరివో తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-01-24T06:44:58+05:30 IST