21న రేషన్‌ వాహనాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-17T09:01:04+05:30 IST

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ఈ నెల 21న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతంలో జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

21న రేషన్‌ వాహనాలు ప్రారంభం

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ఈ నెల 21న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ ప్రాంతంలో జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 9,260 వాహనాలను అధికారులు లబ్ధిదారులకు అందజేస్తారు. వచ్చే నెల 1 నుంచి జరిగే రేషన్‌ పంపిణీని డోర్‌ డెలివరీ విధానంలో పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-01-17T09:01:04+05:30 IST