సెల్ఫ్ ఐసొలేషన్లో కేంద్ర మంత్రి రవిశంకర్
ABN , First Publish Date - 2020-08-03T22:06:25+05:30 IST
కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించిన మరుసటి రోజే..
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు. గత శనివారం సాయంత్రం అమిత్షాను రవిశంకర్ కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్కు వెళ్లిపోయినట్టు రవిశంకర్ కార్యాలయం సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి ఆరోగ్యంగా ఉన్నారని కూడా తెలిపింది.
హోం మంత్రి అమిత్షా ఆదివారంనాడు తనకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షలో తేలిందని ప్రకటిస్తూ, తనను కలుసుకున్న వారు కూడా సెల్ఫ్ ఐసొలేషన్కు వెళ్లాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, అమిత్షాను తాను కలుసుకున్నందున సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్తున్నట్టు రవిశంకర్ కంటే ముందు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో ప్రకటించారు.