కమల దళంలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-06-15T06:45:16+05:30 IST

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సోమవారం బీజేపీలో చేరారు. ఇటీవల మాజీమంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిం దే. అయితే సోమవారం ఢిల్లిలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రదాన్‌, కిషన్‌రెడ్డి,

కమల దళంలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి
బీజేపీలో చేరిన సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి

కామారెడ్డి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సోమవారం బీజేపీలో చేరారు. ఇటీవల మాజీమంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిం దే. అయితే సోమవారం ఢిల్లిలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రదాన్‌, కిషన్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌చంగు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపూరి అరవింద్‌, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా బీజేపీలో చేరిన ఏనుగు రవిందర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, నాయకులు,అనుచరులు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

Updated Date - 2021-06-15T06:45:16+05:30 IST