చంద్రబాబు నాయుడిని కలిసిన రాయపాటి.. కారణమిదే..!

ABN , First Publish Date - 2021-09-16T16:12:14+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును..

చంద్రబాబు నాయుడిని కలిసిన రాయపాటి.. కారణమిదే..!

అమరావతి(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కలిశారు. ఇక్కడ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబుతో బుధవారం భేటీ అయ్యారు. తర్వాత అక్కడ ఉన్న మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యానని, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు, కుమార్తె పోటీ చేయడానికి రెండు సీట్లు ఇవ్వాలని పార్టీ అధినేతకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు తమ కుటుంబానికి ఇవ్వాలని కోరానని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మంచివారికి సీట్లు ఇవ్వడం ద్వారా పార్టీ ఈ గెలుపును అందుకోవాలని రాయపాటి అభి ప్రాయపడ్డారు. 


Updated Date - 2021-09-16T16:12:14+05:30 IST