నేడే ఆర్‌బీఐ పాలసీ

ABN , First Publish Date - 2020-12-04T12:18:12+05:30 IST

ఆర్‌బీఐ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీ సీ) శుక్రవారం రాబోయే రెండు నెలల కాలానికి ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించనుంది. దేశంలో వృద్ధి రేటు ఇప్పటికీ తిరోగమనంలోనే...

నేడే ఆర్‌బీఐ పాలసీ

ముంబై: ఆర్‌బీఐ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీ సీ) శుక్రవారం రాబోయే రెండు నెలల కాలానికి ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించనుంది. దేశంలో వృద్ధి రేటు ఇప్పటికీ తిరోగమనంలోనే ఉన్నప్పటికీ రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నందు వల్ల ఈసారి కూడా ఆర్‌బీఐ రెపోరేట్ల విషయంలో యథాపూర్వస్థితినే కొనసాగించవచ్చంటున్నారు. అయితే రెండో త్రైమాసికంలో ఆర్థిక వ్యవ స్థ ఊహలకు భిన్నంగా పురోగతి కనబరిచిన నేపథ్యంలో ఈ ఏడాదికి వృద్ధి అంచనాలను మాత్రం సవరించే ఆస్కారం ఉంది. అక్టోబరు నాటి ద్రవ్యవిధానంలో ఎంపీసీ ద్వితీయ త్రైమాసికం వృద్ధి -9.5 శాతం ఉండవచ్చని అంచనా ప్రకటించగా వాస్తవ వృద్ధి -7.5 శాతం నమోదైంది. 

Updated Date - 2020-12-04T12:18:12+05:30 IST