అధునాతనంగా రైతు భరోసా కేంద్రాలు

ABN , First Publish Date - 2021-06-19T01:51:06+05:30 IST

రైతు భరోసా కేంద్రాలను అధునాతనంగా నిర్మిస్తామని పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

అధునాతనంగా రైతు భరోసా కేంద్రాలు
ఎంపీడీవోకు సూచనలు ఇస్తున్న ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి

కోట, జూన్‌ 18 :  రైతు భరోసా కేంద్రాలను అధునాతనంగా నిర్మిస్తామని పీఆర్‌  ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.  రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి  కోటలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు,  డెయిరీల భవనాల నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో అన్నిచోట్ల ఆ ప్రభుత్వ నిర్మాణాలు వేగవంతంగా  సాగుతుండగా ఒక్క గూడూరు డివిజన్‌లో మాత్రం 40 శాతం వరకు మాత్రమే పనులు జరిగాయన్నారు.  ఎంపీడీవో భవానీ, ఈవోపీఆర్‌డీ స్వరూపారాణి, పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈ, ఏఈలతోపాటు వైసీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, షేక్‌ మోబీన్‌బాషా, గాదే భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T01:51:06+05:30 IST