బ్రాహ్మణ సంఘటన నాయకుల ఖండన
ABN , First Publish Date - 2020-09-12T17:52:40+05:30 IST
గుడివాడలో టీడీపీ నాయకుడు దింట్యాల రాంబాబు ఇంటిపై మంత్రి కొడాలి నాని అనుచరులు దాడి
విజయవాడ సిటీ : గుడివాడలో టీడీపీ నాయకుడు దింట్యాల రాంబాబు ఇంటిపై మంత్రి కొడాలి నాని అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన (ఆర్బీఎస్) విజయవాడ నగర అధ్యక్షుడు ప్రయాగ కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృత్తమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మల్లాది విష్ణు, కోన రఘుపతి వంటి నాయకులు ఖండించాలని కోరారు.