అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2021-08-03T03:22:23+05:30 IST

కావలిలో జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాల వలన ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు నష్టం వస్తున్నా అధికారులు తమ కేమీ సంబంధంలేదన్నట్లు చోద్యం చూస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే. బ్రహ్మానందం పేర్కొన్నారు.

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలి
ఆర్డీవోకు ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని బహూకరిస్తున్న బీజేపీ నేతలు

కావలి, ఆగస్టు 2: కావలిలో జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాల వలన ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు నష్టం వస్తున్నా అధికారులు తమ కేమీ సంబంధంలేదన్నట్లు చోద్యం చూస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే. బ్రహ్మానందం పేర్కొన్నారు. సోమవారం కావలి ఆర్డీవో కార్యాలయానికి ప్రధానిమంత్రి మోదీ చిత్రపటాన్ని బహూకరించిన అనంతరం అక్రమ మట్టి తవ్వకాలపై ఆర్డీవో శీనా నాయక్‌కు వివరించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక పర్యాయాలు అక్రమ మట్టి తవ్వకాలపై ఆర్డీవోకు, తహసీల్దారుకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. తహసీల్దారుతో అక్రమ తవ్వకాలపై వివరణ కోరగా తాము ఏమీ చేయలేమని చేతులెత్తాశారన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోక పోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు అక్కిలగుంట జీవ, వాయిగండ్ల సుధీర్‌, మంద కిరణ్‌, తూమాటి తిరుపతి స్వామి, షేక్‌ ఖాదర్‌బాషా, వెంకటరెడ్డి, లక్ష్మీప్రసన్న, అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T03:22:23+05:30 IST