ఎన్నికల నిబంధనలు పాటించాలి : ఆర్డీవో
ABN , First Publish Date - 2021-09-19T04:14:26+05:30 IST
ఎన్నికల నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు పని చెయ్యాలని ఆర్డీవో శీనానాయక్ చెప్పారు.
కావలి రూరల్, సెప్టెంబరు 18: ఎన్నికల నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు పని చెయ్యాలని ఆర్డీవో శీనానాయక్ చెప్పారు. పట్టణంలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి మండలాల వారీగా శనివారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో మాట్లాడుతూ జిల్లా, మండల పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించాలన్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుని ఉండాలన్నారు. ఆర్వో రవికుమార్, ఎమ్పీడీవో సుబ్బారావు మాట్లాడుతూ సిబ్బంది ఉదయం 6 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చి కౌటింగ్ కు సిద్ధంగా ఉండాని, 8గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారుసీతామహాలక్ష్మి, తదితరలు పాల్గొన్నారు.