సెలెక్ట్ మొబైల్స్ స్టోర్లలో రియల్మీ శ్రేణి ఫోన్లు
ABN , First Publish Date - 2020-09-16T06:24:39+05:30 IST
సెలెక్ట్ మొబైల్స్.. రియల్మీ శ్రేణి మొబైల్స్ను విడుదల చేసింది. రియల్మీ 7, 7 ప్రో ఫోన్లను సెలెక్ట్ స్టోర్ల
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సెలెక్ట్ మొబైల్స్.. రియల్మీ శ్రేణి మొబైల్స్ను విడుదల చేసింది. రియల్మీ 7, 7 ప్రో ఫోన్లను సెలెక్ట్ స్టోర్ల లో అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు తెలిపారు. ఈ ఫోన్లను ఆయన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెలెక్ట్ మొబైల్స్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయన్నారు.
కంపెనీ యాప్ ద్వారా కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. మూడు నిమిషాలు చార్జింగ్ చేస్తే ఈ ఫోన్స్తో 3.5 గంటలు మాట్లాడొచ్చు. 2.5 గంటలు వినోదం కోసం వినియోగించుకోవచ్చు. లేదా 13 గంటలు మ్యూజిక్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ ఫోన్లను 100 శాతం చార్జింగ్ చేసుకోవడానికి 34 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు.