కొత్త ఫీచర్లతో రియల్మి స్మార్ట్ఫోన్స్..
ABN , First Publish Date - 2021-07-21T23:59:43+05:30 IST
కొత్త ఫీచర్లతో రియల్మి స్మార్ట్ఫోన్స్..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఫీచర్లతో రియల్మి జీటీ మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్, క్వాల్కామ్ ఎస్వోసీలతో మాస్టర్ ఎడిషన్ ప్రారంభించబడిందని సంస్థ పేర్కొంది. రియల్మి జీటీ మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ ఫోన్ ప్రారంభ ధర రూ. 33,400, రియల్మి జీటీ మాస్టర్ ఎడిషన్ రూ .27,700 వద్ద ప్రారంభమవుతుందని సంస్థ తెలిపింది. రియల్మి జీటీ మాస్టర్ సిరీస్ 65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుందని సంస్థ తెలిపింది.