హైదరాబాద్లో విషం తాగి రియల్టర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-10T13:52:17+05:30 IST
బొల్లారం ప్రాంతానికి చెందిన బొబ్బిలి నవీన్రెడ్డికి బొబ్బిలి బంజారకర్ అలియాస్ పింకీతో వివాహం జరిగింది.
హైదరాబాద్ సిటీ/జవహర్నగర్ : వ్యాపారంలో కష్టాలు, అప్పులు పెరిగిపోవడంతో విషం తాగి రియల్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన బొబ్బిలి నవీన్రెడ్డికి బొబ్బిలి బంజారకర్ అలియాస్ పింకీతో వివాహం జరిగింది. నవీన్రెడ్డి స్థిరాస్తి వ్యాపారంలో చేసిన అప్పులు ఎక్కువ కావడంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యాడు. శనివారం ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం కౌకూర్ దర్గా సమీపంలోని అడవిలో నవీన్రెడ్డి మృతదేహం కనిపించింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.