వైభవంగా ‘దివ్యప్రబంధ’ పారాయణం
ABN , First Publish Date - 2021-04-19T06:47:16+05:30 IST
శ్రీరామానుజాచార్యుల అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల పెద్దజీయర్ మఠంలో ఆదివారం రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం వైభవంగా నిర్వహించారు.
తిరుమల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): శ్రీరామానుజాచార్యుల అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల పెద్దజీయర్ మఠంలో ఆదివారం రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10నుంచి 11గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని, శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణాన్ని నిర్వహించారు. జీయర్లతోపాటు వారి శిష్యబృందం దివ్యప్రబంధంలోని పాశురాలను శాస్ర్తోక్తంగా పఠించారు. ఈ కార్యక్రమంలో పెద్ద, చిన్నజీయర్స్వాములు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు.