పార్సీలకు లాక్‌డౌన్ గుడ్‌న్యూస్.. ఒక్క ఏడాదిలో రికార్డు స్థాయిలో జననాలు

ABN , First Publish Date - 2021-06-15T01:03:50+05:30 IST

కరోనా కారణంగా గతేడాది నుంచి ప్రపంచం నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నో దేశాలు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు..

పార్సీలకు లాక్‌డౌన్ గుడ్‌న్యూస్.. ఒక్క ఏడాదిలో రికార్డు స్థాయిలో జననాలు

కరోనా కారణంగా గతేడాది నుంచి ప్రపంచం నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నో దేశాలు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు అనుభవించాయి. అయితే ఇంతటి కరోనా పరిస్థితుల్లోనూ పార్సీ కమ్యూనిటీలో ఓ గుడ్‌న్యూస్ బయటకొచ్చింది. సంతానం లేక ఎన్నో ఏళ్లుగా కనుమరుగవుతున్న పార్సీల్లో ఒక్క 2020లోనే 61 మంది సంతానం జన్మించారు. 2011లో జనాభా లెక్కల ప్రకారం.. కేవలం 57 వేలు మాత్రమే ఉంది. దీంతో పార్సీల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2013-14 మధ్య మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన జియో పార్సీ స్కీమ్ ద్వారా పార్సీల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనికి తోడు గతేడాది మార్చి నుంచి లాక్‌డౌన్ విధించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ లభించడంతో కేంద్రం పని సులువైంది. ఈ ఏడాది కూడా 22 మంది జన్మించారు. దీంతో ఈ 7-8 ఏళ్లలో పార్సీ కమ్యూనిటీలో మొత్తం పుట్టిన పిల్లల సంఖ్య 321కి పెరిగింది. అయితే ఈ సంఖ్య కొంత చిన్నదిగా అనిపించినా.. పార్సీ కమ్యూనిటీలో ఇంతమంది జన్మించడం సంచలనంగా మరింది.




Updated Date - 2021-06-15T01:03:50+05:30 IST